AP News: మరో మోసానికి తెర తీసిన సీఎం జగన్: జవహర్

ABN , First Publish Date - 2022-08-18T16:23:20+05:30 IST

సీఎం జగన్ మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.

AP News: మరో మోసానికి తెర తీసిన సీఎం జగన్: జవహర్

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీపీఎస్ (CPS) ఉద్యోగులకు ఆహ్వానం కేవలం మభ్యపెట్టటానికేనని, ప్రభుత్వం కాలయాపనకే చర్చలు జరుపుతోందని ఆరోపించారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దన్న జగన్ ఇప్పుడు అవగాహన లేదనటం పచ్చిమోసమన్నారు. మూడున్నర ఏళ్లు ఏమార్చిన జగన్ మరో ఏడాది మోసం చేయటం కోత్తేమి కాదన్నారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు ఉద్యోగులు భయపడరన్నారు. నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, సెలక్టివ్ సంఘాలనే ఆహ్వానిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సంఘాలు ప్రభుత్వ అనుకూల సంఘాలుగా మారటం శోచనీయమన్నారు. పీఆర్సీ (PRC) బకాయిలు గురించి పోరాడాలని పిలుపిచ్చారు. డిఏ (DA)లు ఈ నాటికి జమకు నోచుకోకపోవటం ఉద్యోగుల పరిస్థితికి నిదర్శనమన్నారు. పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని జవహర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-18T16:23:20+05:30 IST