నిబంధనలు సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి : జయమంగళ
ABN , First Publish Date - 2020-12-01T06:07:53+05:30 IST
ఇన్పుట్ సబ్సిడీ అందజేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు.
కైకలూరు : ఇన్పుట్ సబ్సిడీ అందజేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. నిబంధనలు సడలించి 20శాతం తేమ ఉన్నప్పటికీ ఽప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మొలక వచ్చిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే కొనుగోలు చేయాలన్నారు. ఆర్య వైశ్య సంఘం నాయకులు పైడిమర్రి మాల్యాద్రి, పూర్ణ, రైతులు పాల్గొన్నారు.