‘ముంపు నివారణ చర్యలు చేపట్టాలి’

ABN , First Publish Date - 2022-08-12T05:29:22+05:30 IST

ఇటీవల భారీ వర్షాలకు కొల్లేరు పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్క మేట వేసుకు పోవడం వల్ల ఎగువ నుంచి వరద నీరు ఉప్పుటేరులోకి వెళ్లకుండా ఆటంకంగా మారిందని, తక్షణమే ముంపు నివారణ చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

‘ముంపు నివారణ చర్యలు చేపట్టాలి’
పెనుమాలంక రహదారిని పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ

మండవల్లి, ఆగస్టు 11 : ఇటీవల భారీ వర్షాలకు కొల్లేరు పెదఎడ్లగాడి వద్ద గుర్రపుడెక్క మేట వేసుకు పోవడం వల్ల ఎగువ నుంచి వరద నీరు ఉప్పుటేరులోకి వెళ్లకుండా ఆటంకంగా మారిందని, తక్షణమే ముంపు నివారణ చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. గురువా రం పెద ఎడ్లగాడి నుంచి పెనుమాకలంక వెళ్లే రహదారిని ఆయన పరిశీలించి మాట్లాడారు. జగన్మోహనరెడ్డి పరిపాలనలో గ్రామానికి దారులే లేకుండా పోతు న్నాయని విమర్శించారు. దిగువకు వరద నీరు వెళ్లక పెనుమాలంక రహదారి ముంపునకు గురవుతుందన్నారు. టీడీపీ హయాంలో రహదారి నిర్మాణానికి ఇబ్బందులు ఎదురైనా రోడ్డు నిర్మాణం చేశామన్నారు. వైసీపీ హయాంలో ట్రక్కు మట్టి కూడా పోయలేదని ఎద్దేవా చేశారు. అధికారులు స్పందించి పెద ఎడ్లగాడి వద్ద గుర్రపు డెక్క తొలగించి ముంపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. 

Updated Date - 2022-08-12T05:29:22+05:30 IST