4న అల్లూరి, వంగవీటి జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-06-29T06:00:32+05:30 IST
అల్లూరి సీతారామరాజు తన పోరాటంతో ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించిన మహానుభావుడని, వంగవీటి మోహన్రంగా సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ, విజయవాడ, హైదరాబాద్లో సేవా కార్యక్రమాలు
పోస్టర్ను ఆవిష్కరించిన ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
సిరిపురం, జూన్ 28: అల్లూరి సీతారామరాజు తన పోరాటంతో ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించిన మహానుభావుడని, వంగవీటి మోహన్రంగా సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని మాజీ మంత్రి, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హోటల్ మేఘలయాలో రాధా రంగా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జూలై 4న వంగవీటిమోహన్రంగా 75వ జయంతి వజోత్సవం, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి, వంగవీటి 75వ జయంతిని పురస్కరించుకుని 4న విశాఖ మనోరమ థియేటర్ వేదికగా భారీ అన్నసమారాధన, విజయవాడ, హైదరాబాద్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాధా రంగా రాయల్ అసోసియేషన్ నిర్వాహకులు గాదె బాలాజీ, కేవీఎస్ భాస్కర్, డాక్టర్ రామకృష్ణకీర్తి, రంగారావు, తదితరులు పాల్గొన్నారు.