Telangana: మేడిగడ్డ బ్యారేజ్ 77 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-09-13T14:13:05+05:30 IST

జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది.

Telangana: మేడిగడ్డ బ్యారేజ్ 77 గేట్లు ఎత్తివేత

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు 77 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,51,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 3.039 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ వద్ద అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో 47,014, ఔట్ ఫ్లో 22,500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 5.46 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-13T14:13:05+05:30 IST