జేసీ పల్లె నిద్ర
ABN , First Publish Date - 2021-07-24T05:56:31+05:30 IST
ప్రజా సమస్యలు తెలుసుకోవ డానికే పల్లె నిద్ర నిర్వహిస్తున్న ట్టు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జీసీ కిషోర్కుమార్ అన్నారు.
గంట్యాడ, జూలై 23: ప్రజా సమస్యలు తెలుసుకోవ డానికే పల్లె నిద్ర నిర్వహిస్తున్న ట్టు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) జీసీ కిషోర్కుమార్ అన్నారు. మండల కేంద్రమైన గంట్యాడ గ్రామంలో శుక్రవారం రాత్రి ఆయన పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి, అనంతరం స్థానికులతో మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసన్న రాఘవ, డిప్యూటీ తహసీల్దార్లు కనకల స్వర్ణకుమార్, కొల్లి సన్యాసినాయుడు, ఆర్ఐ రాజు, సర్పంచ్ అప్పారావు, వైఎస్ సర్పంచ్ ఎం.కృష్ణంరాజు, స్థానిక నాయకులు కొండపల్లి కొండలరావు, మురళి రాజు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.