బుచ్చిలో జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన
ABN , First Publish Date - 2021-10-17T05:14:30+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన చేశారు
బుచ్చిరెడ్డిపాళెం,అక్టోబరు16: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో శనివారం జేసీ గణేష్కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. దామరమడుగు, రేబాల, కాళయకాగొల్లు గ్రామాల్లోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో నరసింహరావు, పంచాయతీ సెక్రటరీలు రామ్మోహన్రావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.