JCB India: కోవూరులో నూతన వర్క్ షాప్ను ప్రారంభించిన జేసీబీ ఇండియా
ABN , First Publish Date - 2022-09-16T03:51:19+05:30 IST
ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరంగా దేశంలోని అగ్రశ్రేణి తయారీదారు జేసీబీ ఇండియా (JCB India ltd)
నెల్లూరు: ఎర్త్ మూవింగ్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పరంగా దేశంలోని అగ్రశ్రేణి తయారీదారు జేసీబీ ఇండియా (JCB India ltd).. కోవూరులో గోల్డ్ఫీల్డ్స్(Goldfields JCB) నూతన షోరూమ్, ఇంటిగ్రేటెడ్ వర్క్షాపును ప్రారంభించింది. ఫలితంగా జేసీబీ ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు నెల్లూరు, చుట్టు పక్కల వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.
14000 చదరపు అడుగుల విస్తీర్ణములో నిర్మించిన ఈ నూతన 3S ఇంటిగ్రేటెడ్ కేంద్రంలో 220 మంది ఉద్యోగులు పనిచేయనున్నారు. వీరిలో దాదాపు 10 శాతం మంది మహిళలు ఉండడం గమనార్హం. ఈ కేంద్రంలో ఒకేసారి 5 వాహనాలును సర్వీస్ చేయొచ్చు. గోల్డ్ఫీల్డ్స్ జేసీబీకి ఏపీలో ప్రస్తుతం ఐదు రూరల్ గ్రోత్ సెంటర్స్, 6 పార్ట్స్ ఔటలెట్, 6 ఇంటిగ్రేటెడ్ సర్వీస్ వర్కషాప్లు ఉన్నాయి.