ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జేడీఏ
ABN , First Publish Date - 2021-12-02T06:01:52+05:30 IST
పట్టణంలోని పలు ఎరువుల దుకాణా లను బుధవారం జేడీఏ చంద్రనాయక్ తనిఖీ చేశారు.
కదిరిఅర్బన్ , డిసెంబరు 1 : పట్టణంలోని పలు ఎరువుల దుకాణా లను బుధవారం జేడీఏ చంద్రనాయక్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని రైతుమిత్ర ఆగ్రోస్, మనగ్రోమోర్ దుకాణాల్లో డ్రిప్పు ఎరువుల అమ్మకాలు రిజిస్టర్లలో వ్యత్యాసాలు ఉండటంతో రూ. 67640 విలువ గల డ్రిప్పు ఎరువులను ఆయన సీజ్ చేశారు. ఎంఆర్పీ ధరలకే ఎరువు లు అమ్మాలని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. ఈపోస్ విధానంలో ఎరువులు విక్రయించాలన్నారు. నకిలీ ఎరువులు, విత్తనాలు , పురుగు మందులు అమ్మితే అలాంటి వారి షాపుల లైసెన్స్లు రద్దు చేస్తామన్నారు. ఈ తనిఖీలలో ఏడీఏ సత్యనారాయణ, ఏఓ షాదాబ్ ఆయన వెంట ఉన్నారు.