ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ మూడో రోజు పరీక్ష
ABN , First Publish Date - 2021-07-26T05:07:15+05:30 IST
ప్రశాంతంగా జేఈఈ మెయిన్స్ మూడో రోజు పరీక్ష
ఖమ్మం ఖానాపురంహవేలి, జూలై 25: జాతీయస్థాయిలో ఎన్టీఏ నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్స్ మూడోవిడత పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 20న, 22న పరీక్షలు జరగ్గా.. 25వ తేదీ ఆదివారం జరిగిన మూడోరోజుల పరీక్షలకు ఖమ్మం కోఆర్డినేటర్ పరిధిలోని ఏడు సెంటర్లలో మొత్తం 1504మందికి 1190మంది విద్యార్థులు హాజరయ్యారు. ఖమ్మంలోని విజయ ఇంజనీరింగ్ కళాశాల, ఎస్బీఐటీ, కిట్స్, బొమ్మ, ప్రియదర్శిని కళాశాలలతో పాటు.. సూర్యాపేటజిల్లా కోదాడలోని అనురాగ్ కాలేజీ, కృష్ణాజిల్లా తిరువురులోని శ్రీవాహిని ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షలు జరిగాయని ఖమ్మం సిటీ కో ఆర్డినేటర్ ఆర్. పార్వతీరెడ్డి తెలిపారు. ఈ పరీక్షలు సోమవారం ముగియ నున్నాయి.