జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-03-09T06:50:23+05:30 IST
జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి.
నగరానికి చెందిన పలువురు విద్యార్థులకు మంచి పర్సంటైల్
విశాఖపట్నం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఈ ఏడాది నాలుగుసార్లు మెయిన్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 24 నుంచి 26వ తేదీ వరకు తొలి దశ పరీక్షలు నిర్వహించింది. ఆ పరీక్షలకు విశాఖ నుంచి సుమారు 15 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించి ఆదివారం తుది కీ విడుదల చేసి, సోమవారం ఫలితాలు వెల్లడించారు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం...నగరంలోని శ్రీచైతన్య విద్యా సంస్థల విద్యార్థులు సాయిసాత్విక్ 99.9566, టి.శ్రీవల్లభ్ 99.91, ఎం.రోహిత్ 99.90, జె.రవీన 99.88, బి.నితీష్కుమార్ 99.88, అర్విన్ దత్త 99.85, కె.దయాన్ వర్దన్ 99.82, పర్సంటైల్ సాధించారు. పరీక్షలు రాసిన వారిలో మరింతమంది వివరాలు ఇంకా రావలసి ఉంది.