తాడేపల్లిగూడెంలో జేఈఈ మెయిన్స్ స్ర్కీనింగ్ పరీక్ష
ABN , First Publish Date - 2021-03-02T05:27:10+05:30 IST
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ కోసం డీఆర్ గోయెంకా కాళాశాల వద్ద స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించారు.
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 1: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ కోసం డీఆర్ గోయెంకా కాళాశాల వద్ద స్ర్కీనింగ్ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన పరీక్ష కేంద్రంగా తాడేపల్లిగూడెంలో సోమవారం నిర్వహించారు. మొత్తం 247 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు ప్రిన్సిపాల్ జి.సుబ్రహ్మణ్యం కో–ఆర్డినేటర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో మరో కో–ఆర్డినేటర్ వంశీకుమార్ పర్యవేక్షించారు.