సీఐటీయూ ఆధ్వర్యంలో జీపు జాత
ABN , First Publish Date - 2021-01-22T06:03:51+05:30 IST
సీఐటీయూ ఆధ్వర్యంలో జీపు జాత
బొంరాస్పేట్: సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జీపుజాత కొనసాగుతుందని, ఈ నెల 27న కొడంగల్ తాలూకాకు వస్తుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సచంద్రయ్య అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహాన కల్పించేందుకు జీపుజాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు.