Jeevan Reddy: కేంద్రానికి లేని అధికారాలను కేసీఆర్ అంటగడుతున్నారు..
ABN , First Publish Date - 2022-09-18T21:33:23+05:30 IST
సీఎం కేసీఆర్ చెబుతున్న గిరిజన రిజర్వేషన్లు రాష్ట్రంలోనే అమలు అవుతాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ (Karimnagar): ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చెబుతున్న గిరిజన రిజర్వేషన్లు (Tribal reservations) రాష్ట్రంలోనే అమలు అవుతాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 7.50 శాతం రిజర్వేషన్లు మాత్రమే కేంద్రం అమలు చేస్తోందన్నారు. రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని లేదని.. కేంద్రానికి లేని అధికారాలను సీఎం కేసీఆర్ అంటగడుతున్నారని, ముఖ్యమంత్రి గిరిజన ద్రోహి అని విమర్శించారు. సీఎంకు తెల్వదని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరని, తెలిసినవాళ్లు చెప్పినా వినరన్నారు. రాష్ట్రంలో అమలు చేయాల్సినవి కేంద్రం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.