TS News: మునుగోడు మాకు సెమీ ఫైనల్స్: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-08T22:27:09+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్ అని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) ధీమా వ్యక్తం చేశారు.

TS News: మునుగోడు మాకు సెమీ ఫైనల్స్: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్స్ అని అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తామంతా తృప్తిగానే ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎవరి సొంతం కాదని, పార్టీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. పేరు, ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో తాను  పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు. 


కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) ఎమ్మెల్యే పదవికి కూడా సోమవారం రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నేరుగా కలిసి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ పరిణామంతో మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక (Munugodu By Election) అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక ఎప్పుడు ఉండబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే మునుగోడులో నిలబెట్టే అభ్యర్థిపై కసరత్తు మొదలుపెట్టాయి.

Updated Date - 2022-08-08T22:27:09+05:30 IST