స్ట్రాంగ్ రూంను పరిశీలించిన జేసీ
ABN , First Publish Date - 2021-03-07T04:31:00+05:30 IST
నగరపంచాయతీ ఎ న్నికల అనంతరం జరి గే కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ శనివారం పరిశీలించారు.
ఎర్రగుంట్ల, మార్చి6: నగరపంచాయతీ ఎ న్నికల అనంతరం జరి గే కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ శనివారం పరిశీలించారు. కౌంటింగ్ కోసం స్ట్రాంగ్ రూంను ఆయన నిషితంగా పరిశీలించి సూచనలు చేశారు. రూం వర్షానికి ఉరుస్తుందా? అని ప్రశ్నించారు. అలాగే కౌంటింగ్ కోసం ఎన్ని రూములు కేటాయించారు. అనే విషయంపై ఆరా తీశారు. శనివారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని చూశారు. కార్యక్రమంలో కమిషనర్ రంగస్వామి,ఎంఈవో ఓబులేసు ఇతరులు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు సీఈవో సుధాకర్రెడ్డి కూడా పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించి పోలింగ్ గురించి అడిగితెలుసుకున్నారు. కమిషనర్ రంగస్వామితో చర్చించారు.