దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలి: జయప్రకాష్
ABN , First Publish Date - 2022-02-02T22:41:58+05:30 IST
దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు
గుంటూరు: దేశ గౌరవం కోసం జిన్నా టవర్ పేరు మార్చాలని కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరు జయప్రకాష్ అన్నారు. నగరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జిన్నా టవర్ అంశం ముస్లింలు, హిందువుల కోసం కాదన్నారు. రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించే పని వైసీపీ చేస్తోందని ఆయన ఆరోపించారు. టవర్ పేరు మార్చకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని ఆయన హెచ్చరించారు. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయన్నారు. కానీ గుంటూరులో మాత్రం విచిత్ర సంఘటనలు జరిగాయన్నారు. జిన్నా టవర్కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని తాము డిమాండ్ చేశామన్నారు. 26వ తేదీన టవర్పై జాతీయ జెండా ఎగుర వేసే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నారన్నారు.
బీజేపీ డిమాండ్ మేరకు టవర్కు రంగులు మార్చారని, జాతీయ జెండా దిమ్మె పెట్టడం శుభపరిణామమన్నారు. జాతీయ జెండా రంగులు మన దేశానికి గర్వ కారణమన్నారు. ముడు రంగులు ఉన్న టవర్కు జిన్నా పేరు పెట్టడం దేశ ద్రోహమన్నారు. దేశ ప్రజలను తీవ్రంగా అవమానించినట్లేనన్నారు. బీజేపీ జాతీయ జెండా ఎగుర వేస్తే మత విద్వేషాలు వస్తాయన్నారన్నారు. మీరు టవర్కు రంగులు మార్చినా, జాతీయ జెండా పెడుతున్నా ఏ మత విద్వేషాలు రాలేదని ఆయన పేర్కొన్నారు.