Reliance Jio: జియో నుంచి మరో సంచలనం.. త్వరలోనే 5జీ ఫోన్లు!
ABN , First Publish Date - 2022-08-16T02:48:50+05:30 IST
సంచలనాలకు వేదిక అయిన రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనానికి సిద్ధమైంది. జియో నుంచి
న్యూఢిల్లీ: సంచలనాలకు వేదిక అయిన రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనానికి సిద్ధమైంది. జియో నుంచి త్వరలోనే 5జీ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 5జీ స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే, 5జీ ఫోన్ లాంచింగ్కు సంబంధించి జియో నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారమూ విడుదల కాలేదు. ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో జియోతోపాటు మరో దిగ్గజ టెలికం సంస్థ ఎయిర్టెల్ ఈ నెలలో 5జీ సేవలను లాంచ్ చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో జియో 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకురాబోతోందన్న వార్త అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బయటకు వెల్లడైన వివరాల ప్రకారం జియో 5జీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు ఇలా ఉండే అవకాశం ఉంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ ప్లస్ రిజల్యూషన్. 60Hz రీఫ్రెష్ రేట్. ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 480 5జీ ప్రాసెసర్. 4జీబీ ర్యామ్, 32 జీబీ, ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వంటి ఫీచర్లు ఉండే ఈ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్తోపాటు జియో యాప్స్ కూడా ఉంటాయి. అలాగే, గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్స్ట్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్లేట్తో పాటు మరెన్నో ఉండనున్నాయి.
ఈ ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించినట్టు తెలుస్తోంది. 18W ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్-సి చార్జింగ్ పాయింట్. జియో 5జీ ఫోన్లో వెనకవైపు 13 ఎంపీ మెగా పిక్సల్తో కూడిన డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.