జమ్మూకాశ్మీర్ లో 17 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-09T22:42:11+05:30 IST

జమ్మూకాశ్మీర్ లో 17 వరకు కర్ఫ్యూ పొడిగింపు

జమ్మూకాశ్మీర్ లో  17 వరకు కర్ఫ్యూ పొడిగింపు

శ్రీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ అక్కడ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆదివారం కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించింది. కొన్ని అవసరమైన సేవలు మినహా కర్ఫ్యూ కఠినంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చే వివాహాలకు అనుమతించే సమావేశాలను ప్రస్తుత 50 నుంచి 25 మందికి తగ్గించారు.

Updated Date - 2021-05-09T22:42:11+05:30 IST