జేఎన్టీయూ బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2021-07-27T04:47:55+05:30 IST
పులివెందుల జేఎన్టీయూ ఇం జనీరింగ్ కళాశాల బీటెక్ 4 సంవత్సరం 2వ సెమిస్టర్ పరీ క్ష ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జీ ఎస్ఎస్ రాజు తెలిపారు.
పులివెందుల టౌన్, జూలై 26: పులివెందుల జేఎన్టీయూ ఇం జనీరింగ్ కళాశాల బీటెక్ 4 సంవత్సరం 2వ సెమిస్టర్ పరీ క్ష ఫలితాలు విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జీ ఎస్ఎస్ రాజు తెలిపారు. స్థానిక జేఎన్టీయూ కళాశాలలో సోమవారం ఫలితాలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 4వ సంవత్సరం విద్యార్థులు 307 మంది పరీక్షకు హాజరు కాగా 302 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ ఫలితాలను కళాశాల వెబ్సైట్లో పొందు పరచామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జివి సుబ్బారెడ్డి, పరీక్ష కేంద్ర విభాగాధిపతులు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు.