జేఎన్టీయూకేలో ఫుడ్‌ ఇంజనీరింగ్‌

ABN , First Publish Date - 2020-12-03T05:49:51+05:30 IST

కాకినాడ జేఎన్టీయూలో ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ప్రారంభించనున్నామని ఉప కులపతి ఎం.రామలింగరాజు తెలిపారు.

జేఎన్టీయూకేలో ఫుడ్‌ ఇంజనీరింగ్‌

జేఎన్టీయూకే, డిసెంబరు 2: కాకినాడ జేఎన్టీయూలో ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ కోర్సు ప్రారంభించనున్నామని ఉప కులపతి ఎం.రామలింగరాజు తెలిపారు.  ఏపీ, పశ్చిమబంగా, సిక్కిం రాష్ట్రాల్లో ఆహార భద్రతా అధికారులుగా ఎంపికైన 31 మందికి 10 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారం వర్సిటీలో ముగిసాయి. ఈ  సందర్భంగా వీసీ రామలింగరాజు మాట్లాడుతూ ఆహార నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా అధికారులు ముందుకుసాగాలని సూచించారు. ఏపీ ప్రివెన్టివ్‌ మెడిసిన్‌ పబ్లిక్‌ హెల్త్‌ల్యాబ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మంజరీ, జాయింట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ డాక్టర్‌ స్వరూప్‌ రీసోర్స్‌ పర్సన్‌లుగా వ్యవహరించగా స్కూల్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ స్వర్ణకుమారి, ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి శశికాంత్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-03T05:49:51+05:30 IST