28న ‘సాందీపని’లో జాబ్‌మేళా

ABN , First Publish Date - 2020-11-26T05:58:21+05:30 IST

జిల్లాకేంద్రంలోని సాందీ పని డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్లు డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

28న ‘సాందీపని’లో జాబ్‌మేళా

కామారెడ్డిటౌన్‌, నవంబర్‌ 25: జిల్లాకేంద్రంలోని సాందీ పని డిగ్రీ కళాశాలలో ఈనెల 28న జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్లు డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేర కు బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా ఈజీఎం ఎం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు మెడ్‌ప్ల స్‌ ఫార్మసీ నిజామాబాద్‌, హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం జా బ్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18 నుంచి 28 ఏళ్ల లోపు బీఫార్మసీ, డీఫార్మసీ, ఎం ఫార్మసీ లే దా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డీగ్రీ విద్యార్హతలు కల్గి ఉండాలని తెలిపారు. ఫార్మ సీ సర్టిఫికెట్‌ కలిగిన వారికి రూ.10,700 నుంచి రూ.16 వేల వరకు, ఉచిత వసతి, డిగ్రీ కల్గిన వారి కి రూ.10 వేల జీతంతో పాటు ఉచిత వసతి ఉంటుందని తెలిపారు. శనివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, వివరాల కు 8919087069 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2020-11-26T05:58:21+05:30 IST