నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూసేందుకే జాబ్మేళా
ABN , First Publish Date - 2022-06-26T04:43:04+05:30 IST
నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూసేందుకే జాబ్మేళా నిర్వహించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
చాపాడు, జూన్ 25: నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూసేందుకే జాబ్మేళా నిర్వహించినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సీబీఐటీ కాలేజీలో నిర్వహించిన వైసీపీ మెగా జాబ్మేళాలో ఎంపీ మాట్లాడు తూ మొత్తం 8,364 మంది పాల్గొనగా 4,500 మందిని కంపెనీ యాజమాన్యాలు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకుని అంచెలంచెలుగా ఎదగాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జాబ్మేళా నిర్వహించామన్నారు. కడప ఎంపీ అవినా్షరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్మేళా విద్యార్థుల జీవితాలకు భరోసా ఇస్తుందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో విద్యార్థులు ఉద్యోగాలను సంపాదించుకోవాలన్నారు.