ఘరానా మోసగాడి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-01T09:52:20+05:30 IST

ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

ఘరానా మోసగాడి అరెస్టు

ఉద్యోగాలు, జ్యోతిషం పేరుతో వసూళ్లు

విజయవాడలో నిందితుడి అరెస్టు

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 28: ప్రజలను, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఏపీలోని విజయవాడకు చెందిన వ్యక్తిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డి నల్లగొండ పట్టణం హనుమాన్‌ నగర్‌లో సామినేని సాయి ఇంటికి వెళ్లి జ్యోతిషం చెప్పాడు. ఇంట్లో బాగా లేదని, శాంతి పూజలు చేస్తేనే ఇల్లు నిలబడుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన సాయి రూ.4.35 లక్ష లు ముట్టజెప్పగా అచ్చిరెడ్డి ఆ డబ్బుతో పరారయ్యాడు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో నల్లగొండ పోలీసులు అచ్చిరెడ్డిని విజయవాడలో అరెస్టు చేశారు. నిందితుడు ఇంతకుముందు కూడా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో షేర్లు ఇస్తానని నమ్మిం చి రూ.50 లక్షలు, మరో మహిళను రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.25 లక్షలు, విజయవాడకు చెందిన ఓ మహిళను టీవీలో యాంకర్‌ను చేస్తానని రూ.25లక్షలు వసూలు చేశాడు. ఇతడిపై ఖమ్మం, విజయవాడ, నల్లగొండ  జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఏపీలోని వైఎ్‌సఆర్‌సీపీలో ముఖ్య నాయకుడిగా ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2021-03-01T09:52:20+05:30 IST