TS News: ఆదిలాబాద్‌ కలెక్టర్‌, ఆర్డీవోపై ఎస్టీ కమిషన్‌ సీరియస్‌

ABN , First Publish Date - 2022-08-04T02:46:37+05:30 IST

ఆదిలాబాద్‌ కలెక్టర్‌, ఆర్డీవోపై ఎస్టీ కమిషన్‌ సీరియస్‌ అయింది. యాపల్‌గూడ, రాంపూర్‌లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఎస్టీల భూమి సేకరిస్తుంటే కలెక్టర్

TS News: ఆదిలాబాద్‌ కలెక్టర్‌, ఆర్డీవోపై ఎస్టీ కమిషన్‌ సీరియస్‌

ఢిల్లీ: ఆదిలాబాద్‌ కలెక్టర్‌, ఆర్డీవోపై ఎస్టీ కమిషన్‌ సీరియస్‌ అయింది. యాపల్‌గూడ, రాంపూర్‌లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఎస్టీల భూమి సేకరిస్తుంటే కలెక్టర్, ఆర్డీవో ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సేకరించిన 107 ఎకరాల భూమిని తిరిగి భూ నిర్వాసితులకు ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌కు ఎస్టీ కమిషన్‌ ఆదేశించింది. భూములు ఇప్పించిన ఎమ్మెల్యే జోగురామన్న, అప్పటి ఆర్డీఓ సూర్యనారాయణపై ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టకూడదని జాతీయ ఎస్టీ కమిషన్ ప్రశ్నించింది

Updated Date - 2022-08-04T02:46:37+05:30 IST