కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీ

ABN , First Publish Date - 2021-06-20T04:00:04+05:30 IST

కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానదిపై

కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీ

హైదరాబాద్: కృష్ణానదిపై కొత్త ఆనకట్ట నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజీని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు జరిగిన కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 70 టీఎంసీల వరద నీటిని పైపుల ద్వారా తరలించాలని కేబినెట్ సూచించింది. పులిచింతల ఎడమ కాలువను నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాకలు సాగు నీరు అందివ్వాలని కేబినెట్‌లో ఆమోదించారు. కల్వకుర్తి ఎత్తపోతల పథకంలో నీటి నిల్వ సామర్థాన్ని 20 టీఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. 

Updated Date - 2021-06-20T04:00:04+05:30 IST