బీజేపీలో పలువురి చేరిక
ABN , First Publish Date - 2022-08-17T05:48:27+05:30 IST
బీజేపీలో పలువురి చేరిక
శామీర్పేట, ఆగస్టు 16 : బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శామీర్పేట మండలం బాబాగూడ గ్రామంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రంరెడ్డి, మండలాధ్యక్షుడు కైర యాదగిరి, ఉపాధ్యక్షుడు దేశం పవన్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎ్సకు చెందిన 40 మంది కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. ఈమేరకు మోహన్రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బాబాగూడ మాజీ ఉపసర్పంచ్ కాసర్ల వెంకటేశ్గౌడ్, కాసర్ల భాగ్యమ్మ, టీఆర్ఎస్ కార్యకర్తలు మేడి శ్రీనివాస్, మేడి మహేష్, తదితర కార్యకర్తలు తదితరులు బీజేపీలో చేరారు.