ఈ-పంట నమోదుకు సంయుక్త అజమాయిషీ

ABN , First Publish Date - 2022-08-09T06:03:17+05:30 IST

వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖల సంయుక్త అజమాయిషీతో ఈ-పంట నమోదు ప్రక్రియను చేపట్టాలని తహసీల్దార్‌ చిరంజీవి సంబంధిత అధికారులకు సూచించారు. ఖరీఫ్‌-2022 సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదుపై సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల వారీ అధికారులతో కూడిన బృందాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధివిధానాలను వివరించారు.

ఈ-పంట నమోదుకు సంయుక్త అజమాయిషీ
మాట్లాడుతున్న తహసీల్దార్‌ చిరంజీవి

టంగుటూరు తహసీల్దార్‌ చిరంజీవి

టంగుటూరు, ఆగస్టు 8 : వ్యవసాయ, రెవెన్యూ, సర్వే శాఖల సంయుక్త అజమాయిషీతో ఈ-పంట నమోదు ప్రక్రియను చేపట్టాలని తహసీల్దార్‌ చిరంజీవి సంబంధిత అధికారులకు సూచించారు. ఖరీఫ్‌-2022 సీజన్‌కు సంబంధించిన ఈ-పంట నమోదుపై సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సచివాలయాల వారీ అధికారులతో కూడిన బృందాల ఏర్పాటు, అందుకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. ఈ-పంట నమోదుకు ఉద్దేశించిన జాయింట్‌ అజమాయిషీ గ్రూపులో గ్రామ రెవెన్యూ అధికారి, ఆర్‌బీకేలోని గ్రామ వ్యవసాయ/ఉద్యానవన సహాయకులు, గ్రామ సర్వే సహాయకులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. వీరంతా వారి సచివాలయం పరిధిలో ఖరీఫ్‌ కింద పంట సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించి ఈ కర్షక్‌ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. జాయింట్‌ అజమాయిషీ కమిటీకి తహసీల్దార్‌ చైర్మన్‌గా, మండల వ్యవసాయాఽధికారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సూపర్‌వైజర్‌లుగా ఉంటారని చెప్పారు. మంగళవారం నుంచే ఈ-పంట నమోదు ప్రక్రియను ప్రారంభించాలని వ్యవసాయాఽఽధికారి స్వర్ణలత కోరారు. సమావేశంలో ఏఎస్‌వో శ్రీవాణి, ఏఈవోలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, గ్రామ సచివాలయాల వీఆర్వోలు, ఆర్‌బీకేల సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:03:17+05:30 IST