అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
ABN , First Publish Date - 2021-07-24T05:31:42+05:30 IST
యండపల్లి (కొత్తపల్లి), జూలై 23: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలందరికీ చేరాలని జేసీ రాజకుమారి సూచించారు. శుక్రవారం ఆమె యండపల్లిలో సచివాలయాలను సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. పథకాల కోసం కార్యాలయాలకు వచ్చే పేదలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సర్పంచ్ శీలం
జేసీ రాజకుమారి
యండపల్లి (కొత్తపల్లి), జూలై 23: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు అర్హులైన పేదలందరికీ చేరాలని జేసీ రాజకుమారి సూచించారు. శుక్రవారం ఆమె యండపల్లిలో సచివాలయాలను సందర్శించారు. సచివాలయ సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. పథకాల కోసం కార్యాలయాలకు వచ్చే పేదలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సర్పంచ్ శీలం పెదఅప్పారావు, ఉప సర్పంచ్ గుండ్ర చిన్నారావు కొత్తపల్లి ఎంపీడీవో పి.వసంతమాధవి, ఈవోపీఆర్డీ విద్యాసాగర్కుమార్, వార్డు సభ్యులు మత్సా విజయతాత పాల్గొన్నారు.