ప్రిన్సిపాల్ మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2020-11-27T05:43:58+05:30 IST
గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన పట్టణంలో బ్రైట్ ఏంజిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.జోసె్ఫబాబు మృతదేహం గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద లభ్యమైంది.
జగ్గయ్యపేట, నవంబరు 26: గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయిన పట్టణంలో బ్రైట్ ఏంజిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎం.జోసె్ఫబాబు మృతదేహం గురువారం పులిచింతల ప్రాజెక్టు వద్ద లభ్యమైంది. ఈ నెల 17న తన భర్త కనిపించటం లేదంటూ జోసె్ఫబాబు సతీమణి షకీనా కుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత పులిచింతల ప్రాజెక్టు వద్ద జోసె్ఫబాబు బైక్ కనిపించటంతో పోలీసులు పడవలతో ప్రాజెక్టులో వెతికించారు. అయినా ఫలితం లేదు. అప్పటి నుంచి పోలీసులు అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండగా గురువారం పులిచింతల వద్ద ఒక మృతదేహం కొట్టుకు వచ్చిందని సమాచారం రావటంతో పోలీసులు, జోసె్ఫబాబు భార్యా పిల్లలను తీసుకెళ్లి చూపించారు. అప్పటికే ముఖం ఛిద్రమైంది. జోసె్ఫబాబుగా గుర్తించారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అదృశ్యం అనుమానాస్పద మృతి కేసుగా మార్చనున్నట్టు ఎస్సై బీవీ రామారావు తెలిపారు. జోస్ఫబాబు మానసిక ఆరోగ్యం బాగా లేదని, మందులు కూడా వాడుతున్నామని భార్య షకీనా కుమారి చెప్పారు.