Jubileehills మైనర్ రేప్ కేసు: నాంపల్లి కోర్టుకు ఏ1 నిందితుడు
ABN , First Publish Date - 2022-06-13T17:31:45+05:30 IST
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్రేప్ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది. ఈరోజు ఉదయం A1 మాలిక్ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మాలిక్కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం నిందితుడిని చంచల్గూడ జైలుకు తరలించారు. నిన్నటితో సాదుద్దీన్ మాలిక్ కస్టడీ ముగిసింది. నాలుగు రోజుల పాటు మాలిక్ను పోలీసులు విచారించారు. మరోవైపు ఈకేసులో మైనర్ నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు.