Jubilihills మైనర్ రేప్ కేసు...సాదుద్దీన్ను విచారిస్తున్న ఏసీపీ
ABN , First Publish Date - 2022-06-09T19:21:10+05:30 IST
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ-1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు సాదుద్దీన్ను పోలీసులు విచరించనున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోని ప్రత్యేక గదిలో మాలిక్ను విచారిస్తున్నారు. అత్యాచారానికి సహకరించిన ఇతర నిందితుల గురించి తీస్తున్నారు. తప్పించుకునేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇన్నోవా వాహనం విషయంలో మరికొందరి పాత్రపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈరోజు రాత్రికి పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు.