26 మంది జూదరుల అరెస్టు

ABN , First Publish Date - 2021-01-24T07:00:32+05:30 IST

పట్టణ సమీపంలోని చుక్కలూరు బైపాస్‌ సమీపాన బండల ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం అర్ధరాత్రి ఇన్‌చార్జ్‌ సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌.. సిబ్బంది తో కలిసి దాడి చేసి, 26 మందిని అరెస్టు చేశారు.

26 మంది జూదరుల అరెస్టు

రూ.9.60 లక్షలు సీజ్‌

రెండుకార్లు, మూడు మోటారు సైకిళ్లు, 

23 సెల్‌ఫోన్ల స్వాధీనం

తాడిపత్రి, జనవరి 23: పట్టణ సమీపంలోని చుక్కలూరు బైపాస్‌ సమీపాన బండల ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం అర్ధరాత్రి ఇన్‌చార్జ్‌ సీఐ తేజమూర్తి, ఎస్‌ఐ ఖాజాహుస్సేన్‌.. సిబ్బంది తో కలిసి దాడి చేసి, 26 మందిని అరెస్టు చేశారు. రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ చైతన్య వివరాలు వెల్లడించారు. ఈ దాడుల్లో 26 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 9.60 లక్షల నగదు, రెండు కార్లు, మూడు మోటా రు సైకిళ్లు, 23 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చుక్కలూరు బైపా్‌సరోడ్డులోని నారాయణరెడ్డికి చెందిన బం డల ఫ్యాక్టరీ ఆవరణలోని లేబర్‌హోంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావటంతో దాడులు చేశారు. పట్టుబడిన వారిలో ఎక్కువమంది కర్నూలు జిల్లాకు చెందిన వారున్నారని డీఎస్పీ తెలిపారు.





Updated Date - 2021-01-24T07:00:32+05:30 IST