మహిళపై నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డ జడ్జి.. ఈజిప్టులో..

ABN , First Publish Date - 2021-01-24T14:37:07+05:30 IST

అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వెళ్తే జడ్జి న్యాయం జరిగేలా తీర్పునిస్తారు. కానీ, అన్యాయం చేసిందే జడ్జి అయితే ఎవరి దగ్గరికి వెళ్లాలి?

మహిళపై నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డ జడ్జి.. ఈజిప్టులో..

దుబాయి: అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వెళ్తే జడ్జి న్యాయం జరిగేలా తీర్పునిస్తారు. కానీ, అన్యాయం చేసిందే జడ్జి అయితే ఎవరి దగ్గరికి వెళ్లాలి? ఈజిప్టులో ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ మహిళను జడ్జి, అతడి ఇద్దరు స్నేహితులు విల్లాకు తీసుకెళ్లి నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్జి స్నేహితుల్లో కాంట్రాక్టర్‌గా ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్ ఇన్‌వెస్ట్‌మెంట్‌కు సంబంధించిన సమావేశానికి హాజరవ్వమంటూ మహిళను మరీనాలోకి ఓ హోటల్‌కు పిలిపించాడు. అనంతరం హోటల్‌లో రూమ్ బుక్ చేయడం కుదరలేదంటూ ఆమెను మాయ చేసి తమకు చెందిన ఓ విల్లాకు తీసుకెళ్లాడు. విల్లాకు చేరుకున్న అరగంట తర్వాత జడ్జి, అతని స్నేహితులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను అదే విల్లాలో ఉంచి నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడి రాక్షసానందం పొందారు. విషయం అధికారులకు చేరడంతో జడ్జి, అతడి మిత్రుల తక్షణ విచారణకు పబ్లిక్ ప్రాసెక్యూషన్ ఆదేశించింది.

Updated Date - 2021-01-24T14:37:07+05:30 IST