కేంద్ర కారాగారాన్ని విజిట్ చేసిన జడ్జి
ABN , First Publish Date - 2022-08-18T05:22:07+05:30 IST
కడప కేంద్రాగారాన్ని బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కవిత విజిట్ చేశారు. జైలు పరిసరాలను పరిశీలించారు.
కడప(రూరల్), ఆగష్టు 17 : కడప కేంద్రాగారాన్ని బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.కవిత విజిట్ చేశారు. జైలు పరిసరాలను పరిశీలించారు. శిక్ష పడిన ముద్దాయిలు, రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర కారాగారంలో ఉన్న లీగల్ ఎయిడ్ క్లీనిక్, ఉచిత న్యాయ సహాయం గురించి తెలియజేశారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పురుషుల, మహిళ విభాగాల డిప్యూటీ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.