కరోనాను జయించిన జడ్పీచైర్‌పర్సన్‌

ABN , First Publish Date - 2021-04-24T04:52:49+05:30 IST

కరోనాను జయించిన జడ్పీచైర్‌పర్సన్‌

కరోనాను జయించిన జడ్పీచైర్‌పర్సన్‌

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌): వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. శుక్రవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆమెకు నెగిటివ్‌ వచ్చింది. కొవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉండడంతో సునీతారెడ్డి ఈనెల 9వ తేదీన కొవిడ్‌ పరీక్ష చేసుకోవడంతో పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్న ఆమె కరోనాను జయించి రికవరీ అయ్యారు. తన ఆరోగ్యం కోసం పూజలు చేసిన, ఆరా తీసిన అభిమానులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-04-24T04:52:49+05:30 IST