2022 వరల్డ్క్పలో ఆడాలనుకుంటున్నా
ABN , First Publish Date - 2020-08-09T09:12:30+05:30 IST
2022కు వాయిదా పడిన మహిళల వరల్డ్క్పపై తాను ఆశాభావంతో ఉన్నట్టు భారత పేసర్ జులన్ గోస్వామి చెప్పింది. నిలకడైన ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో
న్యూఢిల్లీ: 2022కు వాయిదా పడిన మహిళల వరల్డ్క్పపై తాను ఆశాభావంతో ఉన్నట్టు భారత పేసర్ జులన్ గోస్వామి చెప్పింది. నిలకడైన ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో స్థానంలో కోసం ప్రయత్నిస్తానని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగాల్సిన వన్డే వరల్డ్కప్ను 2022కు వాయిదా వేస్తున్నట్టు రెండ్రో జుల క్రితం ఐసీసీ ప్రకటించింది. దీంతో జట్టులోని సీనియర్లు మిథాలీ రాజ్, జులన్ రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచ కప్లో ఆడ తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమయ్యా యి. కానీ, మెగా ఈవెంట్ వాయిదా పడ డంతో ప్రాక్టీస్కు తగినంత సమయం దొరికిందని మిథాలీ ట్వీట్ చేసి..తాను ప్రపంచకప్లో ఆడతానన్న సంకేతాలిచ్చింది. జులన్ కూడా వరల్డ్కప్ ఆడాలనుకుంటున్నట్టు చెప్పింది. టోర్నీని వాయిదా వేసి ఐసీసీ సరైన నిర్ణయం తీసుకుందని గోస్వామి అభిప్రాయపడింది.