ఒకటి నుంచి అంగన్వాడీల్లో భోజనం
ABN , First Publish Date - 2022-06-26T03:59:00+05:30 IST
జూలై ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు భోజనంతోపాటు ఐరన్ మాత్రలు, పాలు, ఉడికించిన
బుచ్చిరెడ్డిపాళెం,జూన్25: జూలై ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు భోజనంతోపాటు ఐరన్ మాత్రలు, పాలు, ఉడికించిన గుడ్లు పంపిణీ చేయనున్నట్టు సీడీపీవో సౌజన్య తెలిపారు. శనివారం బుచ్చిలోని సీడీపీవో కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో స్పాట్ ఫీడింగ్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోనా వల్ల రెండేళ్లుగా బాలింతలు, గర్భిణులకు, చిన్నారులకు ఇళ్ల వద్దకే పౌష్టికాహారం అందజేశామన్నారు. జూలై ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజనం తినిపించాలని ఆదేశించారు. కేంద్రాల్లో చిన్నారులకు నేర్పించాల్సిన విద్యతోపాటు పలు సూచనలు చేశారు.