జిల్లాకు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు

ABN , First Publish Date - 2021-07-25T06:21:25+05:30 IST

జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాకు జూనియర్‌ సివిల్‌ జడ్జిలు

కర్నూలు(లీగల్‌), జూలై 24: జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులకు న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు జిల్లా నుంచి ఒకరిని బదిలీ చేసి, ఆ స్థానంలో మరొకరిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సంవత్సరాలుగా ఒకే చోట పని చేస్తున్న 62 మంది న్యాయమూర్తులను బదిలీ చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు కోర్టులకు న్యాయమూర్తులను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.దివ్యను పత్తికొండ కోర్టుకు, మచిలీపట్నంలో పని చేస్తున్న కె.గురు అరవింద్‌ను ఎమ్మిగనూరు కోర్టుకు, రాజమండ్రిలో పని చేస్తున్న పి.హనీషాను డోన్‌ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, విజయవాడలో పని చేస్తున్న కేపీ సాయిరాంను నంద్యాల ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, శ్రీకాకుళంలో పని చేస్తున్న కె.కిషోర్‌ కుమార్‌ను బనగానపల్లె జూనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. బనగానపల్లెలో పని చేస్తున్న జడ్జి కె.రాకేష్‌ను విశాఖపట్నానికి బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ర్టార్‌ సునీత ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-07-25T06:21:25+05:30 IST