TS News: నేడు అమిత్ షాను కలవనున్న జూనియర్ ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-08-21T18:12:57+05:30 IST
జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి అమిత్ షాను కలవనున్నారు.
హైదరాబాద్ (Hyderabad): సినీ నటుడు, జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) ఆదివారం సాయంత్రం కేంద్రమంత్రి అమిత్ షా (Amit shah)ను కలవనున్నారు. మునుగోడు (Munugodu) సభ తర్వాత అమిత్ షా హైదరాబాద్, రామోజీ ఫిలింసిటీ (Ramoji filmcity)కి వస్తారు. అక్కడ అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ అవుతారు. ఇటీవలే ట్రిపుల్ఆర్ (RRR) సినిమా చూసిన అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి ఆహ్వానించినట్లు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడులో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొననున్నారు.