భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుక
ABN , First Publish Date - 2021-07-25T06:09:50+05:30 IST
జిల్లాలో గురుపౌర్ణమి వేడుకను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
కర్నూలు(కల్చరల్), జూలై 24: జిల్లాలో గురుపౌర్ణమి వేడుకను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మంగళహారతులు, పల్లకీ సేవ, అఖండ సాయినామ పారాయణ నిర్వహించారు. నగరంలోని షిరిడీ సాయుబాబా ఆలయాల్లో వేకువజాము నుంచి అభిషేక పూజలు, పాద పూజలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, ధార్మిక గురువులు, ప్రవచనకర్తలను ఘనంగా సన్మానించారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు తులసీవనంలో ప్రత్యేక పూజలు చేసి మృత్తికను సేకరించారు.