జూరాలకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-09-16T16:35:21+05:30 IST

జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 28 స్పిల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాలకు కొనసాగుతున్న వరద

మహబూబ్‌నగర్: జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 28 స్పిల్ వే గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి నీటిమట్టం: 318.516 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 317.680 అడుగులకు చేరింది. పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ  7.991 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఇన్ ఫ్లో 2,08,000 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. దిగువకు శ్రీశైలం వైపు  2,09,474 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్ ఫ్లో 2,12,561 క్యూసెక్కులుగా ఉంది. 


Updated Date - 2021-09-16T16:35:21+05:30 IST