ముగిసిన జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డి స్వగ్రామ పర్యటన

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

రాష్ట్ర లోకాయుక్తా జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డి నాలుగు రోజుల స్వగ్రామ పర్యటన ముగించు కుని శుక్రవారం హైదరాబాద్‌కు బయ లుదేరివెళ్లారు.

ముగిసిన జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డి స్వగ్రామ పర్యటన
లోకాయుక్తా జస్టీస్‌ లక్ష్మణ్‌ రెడ్డికి వీడ్కోలు పలుకుతున్న దృశ్యం

పెద్దతిప్పసముద్రం మే 20 :రాష్ట్ర లోకాయుక్తా జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డి నాలుగు రోజుల స్వగ్రామ పర్యటన ముగించు కుని శుక్రవారం హైదరాబాద్‌కు బయ లుదేరివెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర లోకాయుక్తా జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం కుటుం బ సభ్యులతో కలసి తన స్వగ్రామమైన టి.సదుం గ్రామపంచాయతీ చెన్నరాయునిపల్లెకు విచ్చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఆయన స్వగ్రామం నుంచి రోడ్డు మార్గాన బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి విమానం లో హైదరాబాదుకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. జస్టీస్‌ లక్ష్మణ్‌ రెడ్డికి కర్ణాటక రాష్ర్టానికి చెందిన పోలీస్‌ అధికారి కోలార్‌ కృష్ణా, పెద్దతిప్పసముద్రం తహసీల్దార్‌ కళావతి, ఎస్‌ఐ మధురామచంద్రుడు, మొలకలచెర్వు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి,మనోజ్‌ జయంత్‌రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు. దివ్యాంగుల జిల్లా జేఏసీఅధ్యక్షుడు సురేంద్ర  లోకాయుక్తా జస్టీస్‌ లక్ష్మణ్‌రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసి  దివ్యాంగుల చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా చూడాలని కోరారు  


Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST