NV Ramana: బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2022-08-20T16:09:04+05:30 IST
నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, సీఎం జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు.
విజయవాడ: నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల భవనాన్ని సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (CJI NV ramana), సీఎం జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy) శనివారం ఉదయం ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో సీజేఐ (CJI), సీఎం (CM Jagan) మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashant Kumar Mishra), ఇతర హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. కాగా.. వీవీఐపీల రాక సందర్భంగా ఈ మార్గంలోకి వాహనాలు రాకుండా పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు.