జూట్ మిల్లు బస్సు బోల్తా
ABN , First Publish Date - 2021-01-22T05:27:21+05:30 IST
జామి మండలం భీ మసింగి సమీపా న చిన్నాపురం పరిధిలో గల ఓ జూట్మిల్లుకి చెందిన బస్సు బోల్తా పడింది.
శృంగవరపుకోట రూరల్ (జామి) : జామి మండలం భీ మసింగి సమీపా న చిన్నాపురం పరిధిలో గల ఓ జూట్మిల్లుకి చెందిన బస్సు బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గురువారం ఉదయం జామి ప్రాంతంలో నివా సం ఉంటున్న కార్మికులను తీసుకొని వెళ్లేందుకు ఈ బస్సు బయలుదేరగా... భీమ సింగి చెరువు వద్దకు వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయింది. దీన్ని గుర్తించిన డ్రైవ ర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సు నుంచి గెంతేశాడు. ఈ స్తంభంపైనే హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అవి ఏమాత్రం తెగిపడిన బస్సు దగ్ధ మయ్యేది. కాగా బస్సులో కార్మికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిం ది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు జామి ఎస్ఐ సుదర్శన్ తెలిపారు.