రైలు ఢీకొని జూట్మిల్లు కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-05-11T05:22:35+05:30 IST
రైలు ఢీకొని జూట్మిల్లు కార్మికుడు మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.
నెల్లిమర్ల, మే 10: రైలు ఢీకొని జూట్మిల్లు కార్మికుడు మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కొండగుంపాం గ్రామానికి చెందిన పతివాడ ఆదినారాయణ (50) సోమవా రం నెల్లిమర్ల జూట్మిల్లు వైపు వెళ్లేందుకు సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొందని కుటుంబీకులు చెబుతున్నారు. ఆదినారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.