జ్యువెలర్స్‌ దుకాణాలపై ఐటీ దాడులు

ABN , First Publish Date - 2021-11-09T18:37:21+05:30 IST

దీపావళి పండుగ వేడుకలు ముగియగానే ఐటీ అధికారులు బెళగావి జిల్లాలో జ్యువెలర్స్‌ మాల్స్‌తో పాటు నాలుగు చోట్ల దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయమే బెళగావితో

జ్యువెలర్స్‌ దుకాణాలపై ఐటీ దాడులు

బెంగళూరు(Karnataka): దీపావళి పండుగ వేడుకలు ముగియగానే ఐటీ అధికారులు బెళగావి జిల్లాలో జ్యువెలర్స్‌ మాల్స్‌తో పాటు నాలుగు చోట్ల దాడులు నిర్వహించారు. సోమవారం ఉదయమే బెళగావితో పాటు గోవా నుంచి వచ్చిన ఐటీ అధికార బృం దాలు దాడులు చేశాయి. బెళగావి నగరం ఖడేబజార్‌లోని పేరొందిన పోతదార్‌ జ్యువెలర్స్‌తో పాటు జాదవ్‌నగర్‌లోని జ్యువెలర్స్‌ యజమాని అనిల్‌ పోతదార్‌ నివాసంపైనా ఏకకాలంలో దాడి చేశారు. కాగా ఇదే జిల్లా గోకాక్‌ పట్టణంలోని బసవనగర్‌లోని బాపణా జ్యువెలర్స్‌ యజమాని విజయబాపణా, పూర్ణవి జ్యువెలర్స్‌, పురుషోత్తమ బాపణాల నివాసాలపైనా దాడులు చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఆఫర్ల పేరిట బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాలు సాగించారనే ఆరోపణల మేరకే దాడులు చేసినట్లు సమాచారం. దాడులకు సంబంధించి పూర్తీ వివరాలను ఐటీ శాఖాధికారులు ప్రకటించలేదు.

Updated Date - 2021-11-09T18:37:21+05:30 IST