జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-11-29T05:47:11+05:30 IST
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం నగరంలో పలు కార్యక్రమాలు జరిగాయి.
గుంటూరు, నవంబరు 28: సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం నగరంలో పలు కార్యక్రమాలు జరిగాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో విద్యానగ ర్లోని తన కార్యాలయంలో పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో బస్టాండ్ రోడ్డులోని తన కార్యాలయంలో, వైసీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు తాడిశెట్టి మురళీమోహన్ ఆధ్వర్యంలో పట్టాభిపురంలో, మార్కెట్యార్డు చైౖర్మన్ ఏసురత్నం ఆధ్వర్యంలో గుజ్జనగుండ్లలోలో పూలే వర్ధంతి నిర్వహించారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ ఇతర నేతలు పూలే విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు.