జ్యోతిరావుపూలే విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-10-01T05:23:38+05:30 IST
బడుగు బలహీన వర్గాల ఆశ్యాజ్యోతి, సంఘ సంస్కర్త జ్యోతిరావుపూలే విగ్రహ ఏర్పాటుకు అధికా రులు అనుమతి ఇవ్వాలని బీసీ హక్కుల పోరాటసమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు.
మదనపల్లె అర్బన్, సెప్టెం బరు30: బడుగు బలహీన వర్గాల ఆశ్యాజ్యోతి, సంఘ సంస్కర్త జ్యోతిరావుపూలే విగ్రహ ఏర్పాటుకు అధికా రులు అనుమతి ఇవ్వాలని బీసీ హక్కుల పోరాటసమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లుగా మదనపల్లె పట్టణంలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం పోరాడుతుంటే అధికారుల్లో స్పందన లేదన్నారు. ఎంతో ఖర్చుచేసి అప్పడే జ్యోతిరావుపూలే విగ్రహం కోనుగోలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను నియమించారే తప్ప అందుకు కావాల్సిన బడ్జెట్ ఒక రుపాయికూడా నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. బీసీలకు ఆర్థికంగా ఎదుగుదలకు రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వైవీ శేఖర్, శ్రీనివాసులు, గురు మూర్తి, చంద్రయ్య, భాస్కర్, రెడ్డెప్ప, బాషా, నిజాముద్దీన్, ఆనంద్,మణి తదితరులు పాల్గొన్నారు.