కార్మికశాఖ ఉపకమిషనర్గా కె.వెంకటేశ్వర్లు
ABN , First Publish Date - 2021-05-07T05:56:27+05:30 IST
కార్మికశాఖ ఉపకమిషనర్గా కె.వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28న 12 మంది సహాయ కమిషనర్లకు ఉపకమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు(న్యూసిటీ), మే 6: కార్మికశాఖ ఉపకమిషనర్గా కె.వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28న 12 మంది సహాయ కమిషనర్లకు ఉపకమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఇన్చార్జి ఉపకమిషనర్ ఎన్.శేషగిరిరావు నుంచి కె.వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సహాయ కార్మికశాఖ అధికారులు కె.కేశన్న, విద్యావతమ్మ, రాంప్రసాద్, శ్రీలక్ష్మీ, సుందరేష్ అభినందనలు తెలిపారు. కార్మి కులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.